కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించిన గల్ఫ్ జెఏసి ప్రతినిధులు
- March 09, 2021
న్యూ ఢిల్లీ:88 లక్షల భారతీయ గల్ఫ్ కార్మికుల జీవితాలపై ప్రభావం చూపే కనీస వేతనాలు తగ్గింపు సమస్యపై తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) ప్రతినిధుల బృందం మంగళవారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
గల్ఫ్ కార్మికులకు 30 నుండి 50 శాతం వేతనాలు తగ్గించడము వలన వారు మరింత పేదరికంలోకి జారిపోయే అవకాశమున్నదని, కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ల రద్దు చేయాలని గల్ఫ్ జెఏసి ప్రతినిధులు మంత్రిని కోరారు.గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్, జేఏసీ రాష్ట్ర నాయకులు స్వదేశ్ పరికిపండ్ల, తోట ధర్మేందర్, కోటపాటి నరసింహ నాయుడు, వీరయ్య మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







