పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు : మలబార్ గోల్డ్

- February 29, 2016 , by Maagulf
పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు : మలబార్ గోల్డ్

2015-16 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ చదువుతున్న రెండువేల మంది నిరుపేద విద్యార్థినులకు రూ.2000 చొప్పున మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ఉపకార వేతనాలను చెక్కుల రూపంలో అందజేసింది. సామాజిక సేవలో భాగంగా ఎంపవరింగ్ ఎడ్యుకేషన్, ఎంపవరింగ్ ఉమెన్‌హుడ్ కార్యక్రమం కింద 22వ వార్షికోత్సవం సందర్భంగా ఉపకారవేతనాలు అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్.. విద్యార్థులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ కంపెనీల చైర్మన్ శ్రీ ఎంపీ ఆహ్మద్ మాట్లాడుతూ.. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించామన్నారు.వైద్యం, విద్య, మహిళా సాధికారిత కోసం సంస్థ కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాలను ప్రకటించింది. దేశంలోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో విద్య, మహిళా సాధికారత, ఆరోగ్య, గృహ నిర్మాణం, పర్యావరణం తదితర అంశాల్లో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టింది. గత రెండు దశాబ్దాలుగా వ్యాధిగ్రస్తులకు ఔషధాల పంపిణీ, నిరాశ్రయ ప్రజలకు ఇండ్ల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ చేపడుతున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com