ఎయిర్ అరేబియా బంపర్ ఆఫర్!
- April 08, 2021
షార్జా: యూఏఈ నుంచి ఇండియాకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్న భారతీయులకు షార్జా కేంద్రంగా పని చేస్తున్న ఎయిర్ అరేబియా విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండియాకు వెళ్లేందుకు అతి తక్కవ ధరకే విమాన టికెట్లను అందిస్తున్నట్టు వెల్లడించింది. కేవలం 300దిర్హమ్లతో భారత్కు ప్రయాణించొచ్చని పేర్కొంది. అయితే భారత్లోని ఎంపిక చేసిన నగరాలకు వెళ్లేందుకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిందని స్పష్టం చేసింది.యూఏఈ నుంచి ముంబైకి కేవలం 300 దిర్హమ్లను మాత్రమే వసూలు చేయనున్నట్టు తెలిపింది.
ఢిల్లీ, చెన్నైకి వెళ్లేందుకు వరుసగా 350, 410 దిర్హమ్లు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. కాలికట్, బెంగళూరు వెళ్లేందుకు వరుసగా 325, 390 దిర్హమ్లకే టికెట్ అందిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా భారత్ వచ్చే ప్రయాణికుల కోసం ఈ విమానయాన సంస్థ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు ప్రయాణికులు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ను పొంది ఉండాలని స్పష్టం చేసింది. ఆ సర్టిఫికెట్ను ఎయిర్ సువిధా పోర్టల్(https://www.newdelhiairport.in/airsuvidha/apho-registration)లో అప్లోడ్ చేయడంతోపాటు సెల్ఫ్ డిక్లరేషన్ను సమర్పించాలని కోరింది. అంతేకాకుండా ఆరోగ్యసేతు మొబైల్ యాప్ను ప్రయాణికులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి, షార్జా)
తాజా వార్తలు
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!









