భారత్-దుబాయ్ ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ పై కొత్త సూచనలు
- April 20, 2021దుబాయ్: భారత్ లో కోవిడ్ తీవ్రత శరవేగంగా పెరిగిపోతుండటంతో ఇప్పటికే పలు దేశాలు ఇండియాపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో దుబాయ్ కూడా భారత్ నుంచే వచ్చే ప్రయాణికులపై ఫోకస్ చేసింది.పీసీఆర్ టెస్ట్ రిపోర్టులకు సంబంధించి కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది.దుబాయ్ ఫ్లైట్ ఎక్కే సమయానికి 48 గంటల్లోపు శాంపిల్ ఇచ్చిన పీసీఆర్ రిపోర్ట్ లనే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.ప్రయాణికులు తాము బయల్దేరే ప్రాంతంలో ఏ రోజు,ఏ సమయంలో శాంపిల్ ఇచ్చారో స్పష్టంగా పేర్కొవాలి.అలాగే రిపోర్ట్ జారీ చేసిన తేది, సమయాన్ని కూడా స్పష్టంగా పేర్కొవాలి.పీసీఆర్ రిపోర్ట్ పై ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ ఉండాలని కోడ్ స్కాన్ చేయటం ద్వారా ల్యాబ్ వివరాలతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ వివరాలను కూడా ఎయిర్ లైన్స్ సంస్థలు క్రాస్ చెక్ చేసుకుంటాయని దుబాయ్ వెల్లడించింది.ఏప్రిల్ 22 నుంచి ఈ కొత్త మార్గనిర్దేశకాలు అమలులోకి రానున్నాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్