భారత్-దుబాయ్ ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ పై కొత్త సూచనలు
- April 20, 2021
దుబాయ్: భారత్ లో కోవిడ్ తీవ్రత శరవేగంగా పెరిగిపోతుండటంతో ఇప్పటికే పలు దేశాలు ఇండియాపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో దుబాయ్ కూడా భారత్ నుంచే వచ్చే ప్రయాణికులపై ఫోకస్ చేసింది.పీసీఆర్ టెస్ట్ రిపోర్టులకు సంబంధించి కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది.దుబాయ్ ఫ్లైట్ ఎక్కే సమయానికి 48 గంటల్లోపు శాంపిల్ ఇచ్చిన పీసీఆర్ రిపోర్ట్ లనే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.ప్రయాణికులు తాము బయల్దేరే ప్రాంతంలో ఏ రోజు,ఏ సమయంలో శాంపిల్ ఇచ్చారో స్పష్టంగా పేర్కొవాలి.అలాగే రిపోర్ట్ జారీ చేసిన తేది, సమయాన్ని కూడా స్పష్టంగా పేర్కొవాలి.పీసీఆర్ రిపోర్ట్ పై ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ ఉండాలని కోడ్ స్కాన్ చేయటం ద్వారా ల్యాబ్ వివరాలతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ వివరాలను కూడా ఎయిర్ లైన్స్ సంస్థలు క్రాస్ చెక్ చేసుకుంటాయని దుబాయ్ వెల్లడించింది.ఏప్రిల్ 22 నుంచి ఈ కొత్త మార్గనిర్దేశకాలు అమలులోకి రానున్నాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







