విజిట్ వీసాదారులకు వ్యాక్సిన్ ఇవ్వట్లేదని తేల్చేసిన యూఏఈ
- April 29, 2021
యూఏఈ: విజట్ విసాపై యూఏఈలో ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని యూఏఈ ఆరోగ్య శాఖ కొట్టిపారేసింది. విజిట్ విసాదారులకు వ్యాక్సిన్ ఇవ్వట్లేదని క్లారిటీ ఇచ్చింది. పర్యాటక విసాతో ప్రస్తుతం యూఏఈలో ఉన్న వారికి రస్ అల్ ఖైమా ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారంటూ ఇటీవలి కాలంలో వాట్సాప్ మెసేజ్ లు చక్కలర్లు కొడుతోంది. అంతేకాదు..జనం నమ్మేలా యూఏఈ ఆరోగ్యశాఖ వెబ్ సైట్ సమాచారంలా సందేశాన్ని మేకోవర్ చేశారు. దీంతో చాలా మంది నిజమనుకొని రస్ అల్ ఖైమా ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్నారు. విజిట్ వీసాతో ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న మన్మోహన్ సింగ్ అతని భార్య కూడా ఇలాంటి మేసేజ్ చూసి దుబాయ్ నుంచి రస్ అల్ ఖైమాలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అయితే..అది ఫేక్ మేసేజ్ అని తెల్సుకున్నారు. మన్మోహన్ సింగ్ దంపతుల తరహాలోనే అప్పటికే చాలా మంది విజిట్ వీసాదారులు రస్ అల్ ఖైమా ఆరోగ్య కేంద్రానికి వెళ్లినట్లు తెలుస్తోంది.దీంతో వాట్సాప్ మెసేజ్ లపై స్పందించిన ఆరోగ్య శాఖ పర్యాటకులను ఉద్దేశిస్తూ తాము విజిట్ విసాదారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ అందించట్లేదని స్పష్టం చేసింది.

తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









