బెంగాల్ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

- May 05, 2021 , by Maagulf
బెంగాల్ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

బెంగాల్: బెంగాల్ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటలకు కీలక నిర్ణయం తీసుకున్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు కఠినం చేశారు.  ప్రజలు మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.మాస్క్ ధరించకుంటే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం మంది మాత్రమే హాజరుకావాలని పేర్కొన్నారు.మాల్స్, సినిమా హాల్స్, జిమ్స్, బ్యూటీ పార్లర్లు మూసి ఉంటాయని అన్నారు. రాజకీయ, సామాజిక సమావేశాలపై మమతా సర్కార్ నిషేధం విధించింది.సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మమతా పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com