విజయ డెయిరీ విభజన ప్రక్రియ...
- March 04, 2016
పాడి అభివృద్ధి సహకార సమాఖ్యగా రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ పాడి అభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) విభజన ప్రక్రియ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర పాడి అభివృద్ధి సహకార సమాఖ్య పేరుతో రిజిస్ట్రేషన్ పూర్తయింది. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని శుక్రవారం తెలంగాణ విజయ డెయిరీ అధికారులు అందుకున్నారు. అయితే తెలంగాణలోనూ విజయ డెయిరీ పేరే కొనసాగనుంది. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఏపీ డెయిరీకి చైర్మన్గా మన్మోహన్సింగ్ ఉండగా, తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్గా తెలంగాణ పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్చందా వ్యవహరించనున్నారని విజయ డెయిరీ వర్గాలు తెలిపాయి.
దశల వారీగా ఆస్తుల విభజన ప్రక్రియ జరగనుంది. ఏపీలో 52 మంది ఉద్యోగులుండగా, తెలంగాణ డెయిరీలో 390 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, ఏపీలోనూ తెలంగాణ పాల సేకరణ ఉన్నందున కలసి పనిచేస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదిలాఉండగా ఏపీ డెయిరీకి గత పదేళ్లకు పైగా ఎన్నికలు జరగలేదు. డెయిరీ విభజన పూర్తిస్థాయిలో జరిగి తెలంగాణ డెయిరీ ఏర్పడ్డాక పాడి సహకార ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని వ్యవసాయ మంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్







