యెమెన్‌లో ఓ వృద్ధాశ్రమంపై భీకర దాడి..

- March 04, 2016 , by Maagulf
యెమెన్‌లో ఓ వృద్ధాశ్రమంపై భీకర దాడి..

యెమెన్‌లో ఓ వృద్ధాశ్రమంపై జరిగిన భీకర దాడిలో ఒక భారతీయ నర్సు మృతిచెందినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తెలిపారు. నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం ఆయుధాలతో చొరబడి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో నలుగురు నర్సులు ఉండగా.. వారిలో ఒకరు భారతదేశానికి చెందిన వారుగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. మృతుల్లో నలుగురు భారతీయ నర్సులు ఉన్నారని విదేశాంగ శాఖమంత్రి సుష్మాస్వరాజ్‌ తొలుత ప్రకటించారు. అయితే మృతుల్లో ఒకరు మాత్రమే భారతీయురాలని వికాస్‌ స్వరూప్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com