కుమారుడి నిర్వాకం పై స్పందించిన రావెల
- March 05, 2016
తన కుమారుడిపై కేసు నమోదైన విషయంపై మంత్రి రావెల స్పందించారు. తన కుమారుడు సుశీల్పై కేసు నమోదైందని, తెలంగాణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని రావెల చెప్పారు. నేరం జరిగిందా లేదా అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుందని, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోరని మంత్రి రావెల స్పష్టం చేశారు. చట్టంపై, రాజ్యాంగంపై తనకు గౌరవం ఉందని, ఇలాంటి పనులు ఎవరు చేసినా తప్పేనని రావెల అన్నారు. వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్బాబు కుమారుడు రావెల సుశీల్పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!









