దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- March 08, 2026
దుబాయ్: దుబాయ్లో గగనతలంలో జరిగిన ఒక ఏరియల్ ఇంట్రసెప్షన్ నుంచి పడిన అవశేషాలు ఒక కారుపై పడటంతో డ్రైవర్ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు ఆసియా దేశానికి చెందిన వ్యక్తిగా అధికారులు తెలిపారు.
దుబాయ్ మీడియా ఆఫీస్ తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటన అల్ బర్షా ప్రాంతంలో జరిగినట్లు పేర్కొంది. గగనతలంలో జరిగిన అడ్డుగోలు చర్యలో భాగంగా విడిపోయిన అవశేషాలు కిందికి పడి అక్కడుగా వెళ్తున్న వాహనాన్ని తాకినట్లు సమాచారం.
ఘటన సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే కారులో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని దుబాయ్ మీడియా ఆఫీస్ తెలిపింది.
మృతుడి వివరాలు, అలాగే ఘటనకు దారితీసిన ఖచ్చితమైన కారణాలపై మరింత సమాచారం త్వరలో వెల్లడించే అవకాశముందని అధికారులు తెలిపారు.
tive.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









