భారత్ కరోనా అప్డేట్

- May 28, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో రెండవ విడత కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. పాజిటివ్ కేసులు తగ్గినా.. కరోనా మరణాలు ఆగడం లేదు. దేశంలో గడచిన 24 గంటలలో 1,86,364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా…3,660 మంది మృతి చెందారు.గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,59,459 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457 కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 23,43,152 కు చేరగా…కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,48,93,410 కు చేరింది.కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,18,895 కు చేరింది. దేశంలో ఇప్పటి వరకు 20,57,20,660 మందికి వ్యాక్సినేషన్ అందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com