లోన్ చెల్లింపులపై రిలీఫ్..ఈఎంఐ చెల్లింపులు వాయిదా
- May 28, 2021
బహ్రెయిన్: కోవిడ్ తో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో బ్యాంక్ లోన్లు రుణగ్రహీతలకు అదనపు భారం కాకుండా బహ్రెయిన్ ప్రభుత్వం మరోసారి మారటోరియం ప్రకటించింది బహ్రెయిన్. ఆరు నెలల పాటు రుణాల ఈఎంఐ వసూళ్లను వాయిదా వేస్తూ నిర్ణయించింది. కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా రాయల్ ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ దేశంలోని అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు మారటోరియం సర్క్యూలర్ జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అంటే 6 నెలల పాటు లోన్ వాయిదాల చెల్లింపులు వాయిదా వేసుకోవచ్చు. ఈ మారటోరియం కాలానికి సంబంధించి ఎలాంటి ఆలస్యం రుసుములు, అదనపు ఛార్జీలు, వడ్డీలు ఉండవు. అలాగే వాయిదాల సంఖ్యను పెంచొద్దని, అయితే..వాయిదా వ్యవధిని బట్టి రుణాలపై వర్తించే వడ్డీ రేట్లు యధాతథంగా కొనసాగుతాయిని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







