లోన్ చెల్లింపులపై రిలీఫ్..ఈఎంఐ చెల్లింపులు వాయిదా
- May 28, 2021బహ్రెయిన్: కోవిడ్ తో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో బ్యాంక్ లోన్లు రుణగ్రహీతలకు అదనపు భారం కాకుండా బహ్రెయిన్ ప్రభుత్వం మరోసారి మారటోరియం ప్రకటించింది బహ్రెయిన్. ఆరు నెలల పాటు రుణాల ఈఎంఐ వసూళ్లను వాయిదా వేస్తూ నిర్ణయించింది. కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా రాయల్ ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ దేశంలోని అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు మారటోరియం సర్క్యూలర్ జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అంటే 6 నెలల పాటు లోన్ వాయిదాల చెల్లింపులు వాయిదా వేసుకోవచ్చు. ఈ మారటోరియం కాలానికి సంబంధించి ఎలాంటి ఆలస్యం రుసుములు, అదనపు ఛార్జీలు, వడ్డీలు ఉండవు. అలాగే వాయిదాల సంఖ్యను పెంచొద్దని, అయితే..వాయిదా వ్యవధిని బట్టి రుణాలపై వర్తించే వడ్డీ రేట్లు యధాతథంగా కొనసాగుతాయిని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు