'సందీప్ కిషన్' ఓ ఇంటివాడైనాడు
- March 14, 2016
'ప్రస్థానం' చిత్రంతో 2009లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయకుడు 'సందీప్ కిషన్'. ఆయనకు చిన్నతనం నుంచీ మూడు కోర్కెలు ఉండేవట. అవి ఏవో కాదు... సాధారణంగా అందరూ కావాలనుకునేవే! సొంత ఇల్లు, స్పోర్ట్స్ కారు, హోం థియేటర్. ఇందులో ఒకటైన ఇంటిని ఇటీవల ఆయన కొన్నారు. మాదాపూర్లోని నాలుగు పడక గదుల ఇల్లును కొన్నట్లు సందీప్ తెలిపారు. తన అపార్ట్మెంట్ నుంచి దుర్గంచెరువు కనబడుతుందని, అన్ని సౌకర్యాలు బావున్నాయని చెప్పారు. ఈ అపార్ట్మెంట్ ఎవరిదో కాదు. ఆయన మామయ్యదేనట. సందీప్ తన చిన్నతనంలోనే ఈ ఇంటిని కొంటానని తన మామయ్యతో అనేవాడట.తరువాత ఆయన మామయ్య దర్శకుడు వి.వి. వినాయక్కు అపార్ట్మెంట్ను అమ్మేశారు. దాదాపు ఏడేళ్లుగా దాచుకున్న డబ్బుతో సందీప్ కొద్ది నెలల క్రితం వినాయక్ దగ్గర నుంచి అపార్ట్మెంట్ను కొన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







