ఢిల్లీ కోర్టు ఆవరణలో కాల్పులు..ముగ్గురు దుర్మరణం

- September 24, 2021 , by Maagulf
ఢిల్లీ కోర్టు ఆవరణలో కాల్పులు..ముగ్గురు దుర్మరణం

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం ఆవరణలో  ఓ గ్యాంగ్‌ కాల్పులకు పాల్పడటంతో ముగ్గురు మృతి చెందారు. ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్‌ 207లో ఈ ఘటన జరిగింది. రెండు గ్యాంగుల మధ్య వాగ్వాదం ఏర్పడి కాల్పులకు దారి తీసింది. లాయర్‌ దుస్తుల్లో వచ్చిన ఓ గ్యాంగ్‌ కాల్పులకు పాల్పడింది. ఓ కేసు విషయంలో గ్యాంగ్‌ స్టర్‌ జితేంద్ర కోర్టు రాగా లాయర్‌ దుస్తులు వచ్చిన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్‌ జితేంద్రతోపాటు మరో ముగ్గురు మృతి చెందారు. వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com