IPL: ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు

- September 26, 2021 , by Maagulf
IPL: ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు

యూఏఈ: ఐపీఎల్‌లో ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి.అబుధాబి వేదికగా చెన్నై సూపర్ సింగ్స్‌తో, కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీ కొట్టనుండగా…రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై ఈ మ్యాచ్ గెలిచి ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువ అయ్యేందకు ప్రయత్నిస్తుంది. గత మ్యాచ్‌లో ఓటమి పాలైన కోల్‌కతా ఈ సారి ఎలగైనా గెలవాలనే పట్టదలతో ఉంది. ఇక ముంబై, బెంగుళూరు చెరో 8 పాయింట్లతో ఉండగా…ఫ్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు రెండు టీంల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. కాగా.. నిన్న సాయంత్రం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com