హైదరాబాద్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం.!
- September 30, 2021

యూఏఈ: సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) జట్టు మరోసారి నిరాశాజనక ప్రదర్శన చేసింది. చెన్నై సూపర్కింగ్స్తో గురువారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్లో సన్రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులకే పరిమితమైంది. 11 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసి భారీస్కోర్ సాధించేలా కనిపించిన సన్రైజర్స్ ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయి స్వల్ప స్కోర్కే పరిమితమైంది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్కు దిగిన సన్స్రైజర్స్ను ఓపెనర్ వృద్ధిమాన్ సాహా చేసిన 44 పరుగుతో రాణించినా.. జేసన్ రారు(2) నిరాశపర్చాడు. గత మ్యాచ్లో ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించిన జేసన్ రారు.. కేవలం 2 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్(11), రియాన్ పరాగ్(7), హోల్డర్(5) ఘోరంగా విఫలం కాగా.. అభిషేక్ శర్మ(18), అబ్దుల్ సమద్(18) ఫర్వాలేదనిపించారు. రెండో అర్ధభాగంలో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్రైజర్స్ జట్టు భారీస్కోర్పై ఆశలు వదుకుకుంది. హేజెల్వుడ్కు మూడు, బ్రావోకు రెండు, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాకు తలా ఒక వికెట్ దక్కాయి.
స్కోర్బోర్డు..
సన్రైజర్స్ హైదరాబాద్: జేసన్ రారు (సి)ధోనీ (బి)హేజిల్వుడ్ 2, సాహా (సి)ధోనీ (బి)జడేజా 44, విలియమ్సన్ (ఎల్బి) బ్రేవో 11, రియాన్ పరాగ్ (సి)ధోనీ (బి)బ్రేవో 7, అభిషేక్ శర్మ (సి)డుప్లెసిస్ (బి)హేజిల్వుడ్ 18, అబ్దుల్ సమద్ (సి)మొయిన్ (బి)హేజిల్వుడ్ 18, హోల్డర్ (సి)దీపక్ చాహర్ (బి)శార్దూల్ 5, రషీద్ ఖాన్ (నాటౌట్) 17, భువనేశ్వర్ (నాటౌట్) 2, అదనం 10. (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 134 పరుగులు.
వికెట్ల పతనం: 1/23, 2/43, 3/66, 4/74, 5/109, 6/110, 7/117
బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-32-0, హేజిల్వుడ్ 4-0-24-3, శార్దూల్ ఠాకూర్ 4-0-37-1, బ్రేవో 4-0-17-2, జడేజా 3-0-14-1, మొయిన్ అలీ 1-0-5-0





తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







