ప్రపంచంలోనే అతి పెద్ద షో దుబాయ్ ఎక్స్పో 2020 ప్రారంభం
- October 01, 2021
దుబాయ్: కరోనా పాండమిక్ నేపథ్యంలో ఏడాది పాటు ఆలస్యమయిన ఎక్స్పో 2020 దుబాయ్, అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. 3000 మంది ప్రేక్షకుల సమక్షంలో ప్రారంభ కార్యక్రమం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత టెనార్ ఆండ్రియా బోసెల్లి, ప్ముఖ సింగర్ మరియు సాంగ్ రైటర్ ఆండ్రా డే, మరో ప్రముఖ సాంగ్ రైటర్ ఎల్లీ గౌల్డింగ్, అంతర్జాతీయ పియానిస్ట్ లాంగ్ లాంగ్, నాలుగు సార్లు గ్రామీ విజేతగా నిలిచిన ఆంజెలిక్ కిడ్జో తదితరులతో ప్రారంభ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూఏఏ వ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా 480 చోట్ల లైవ్ స్ట్రీమింగ్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం అత్యద్భుతమైన రీతిలో ఫైర్ వర్క్స్ ప్రదర్శన వుంటుంది. ఆరు నెలలపాటు ఈ ఈవెంట్ జరుగుతుంది. 25 మిలియన్ల మంది ఈ ఈవెంట్ని సందర్శించనున్నారు. 200 మంది పార్టిసిపెంట్స్ 192 దేశాల నుంచి ఈ ఈవెంట్లో పాల్గొంటారు. గంటకు 44,000 మంది ప్రయాణీకుల్ని ఈ ఈవెంట్కి తీసుకొచ్చేలా రవాణా సౌకర్యాలూ ఏర్పాటయ్యాయి. 200 డైనింగ్ స్పాట్స్, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన అత్యద్భుతమైన రుచుల్ని అందించనున్నాయి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







