ప్రపంచంలోనే అతి పెద్ద షో దుబాయ్ ఎక్స్పో 2020 ప్రారంభం
- October 01, 2021
దుబాయ్: కరోనా పాండమిక్ నేపథ్యంలో ఏడాది పాటు ఆలస్యమయిన ఎక్స్పో 2020 దుబాయ్, అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. 3000 మంది ప్రేక్షకుల సమక్షంలో ప్రారంభ కార్యక్రమం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత టెనార్ ఆండ్రియా బోసెల్లి, ప్ముఖ సింగర్ మరియు సాంగ్ రైటర్ ఆండ్రా డే, మరో ప్రముఖ సాంగ్ రైటర్ ఎల్లీ గౌల్డింగ్, అంతర్జాతీయ పియానిస్ట్ లాంగ్ లాంగ్, నాలుగు సార్లు గ్రామీ విజేతగా నిలిచిన ఆంజెలిక్ కిడ్జో తదితరులతో ప్రారంభ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూఏఏ వ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా 480 చోట్ల లైవ్ స్ట్రీమింగ్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం అత్యద్భుతమైన రీతిలో ఫైర్ వర్క్స్ ప్రదర్శన వుంటుంది. ఆరు నెలలపాటు ఈ ఈవెంట్ జరుగుతుంది. 25 మిలియన్ల మంది ఈ ఈవెంట్ని సందర్శించనున్నారు. 200 మంది పార్టిసిపెంట్స్ 192 దేశాల నుంచి ఈ ఈవెంట్లో పాల్గొంటారు. గంటకు 44,000 మంది ప్రయాణీకుల్ని ఈ ఈవెంట్కి తీసుకొచ్చేలా రవాణా సౌకర్యాలూ ఏర్పాటయ్యాయి. 200 డైనింగ్ స్పాట్స్, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన అత్యద్భుతమైన రుచుల్ని అందించనున్నాయి.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







