వచ్చే ఏడాది నుంచి వర్క్ పర్మిట్ ఫీజు పెరిగే అవకాశం

- October 04, 2021 , by Maagulf
వచ్చే ఏడాది నుంచి వర్క్ పర్మిట్ ఫీజు పెరిగే అవకాశం

కువైట్: వలసదారుల వర్క్ పర్మిట్ విధానాన్ని అప్‌డేట్ చేయాలనీ అలాగే వర్క్ పర్మిట్ ఫీజు పెంచాలనీ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎమ్)కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సూచించడం జరిగింది. మేన్ పవర్ అథారిటీ అందించే సేవలపైనా ఫీజు పెంపు ప్రతిపాదన వుంది. విదేశీ కార్మికుల వీసాల రుసుము కూడా పెంచనున్నారు. రెసిడెన్సీ ట్రేడ్ అలాగే మార్జినల్ వర్కర్స్ విధానాన్ని తొలగించనున్నారు. 2022 రెండో క్వార్టర్ లేదా మూడో క్వార్టర్ నాటికి ఈ ప్రతిపాదన పూర్తయ్యే అవకాశం వుంది. ప్రతి విభాగం లేదా ఎకనమిక్ యాక్టివిటీకి సంబంధించి వలసదారులు అలాగే నేషనల్ వర్కర్స్‌కి సంబంధించిన కోటా తప్పనిసరి చేయనున్నారు. 2022 మొదట్లో 5 శాతం నేషనల్ లేబర్ రీప్లేస్‌మెంట్ మొదలు పెట్టి, 2025 నాటికి దాన్ని 20 శాతానికి తీసుకెళతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com