ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులందరికీ ఆరు రోజులు సెలవు
- October 07, 2021
యూఏఈ: దుబాయ్ ఎక్స్ పో 2020 చూడాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఆరు రోజుల పెయిడ్ లీవ్స్ ను మంజూరు చేసింది. యూఏఈ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నేతృత్వంలో కేబినెట్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. యూఏఈ వైస్ ప్రెసెడింట్, యూఏఈ ప్రధాన మంత్రి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఫెడరల్ ప్రభుత్వంలోని ఉద్యోగులంతా వారి కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ ఎక్స్ పో ను చూడవచ్చని ప్రభుత్వం తెలిపింది. దుబాయ్ ప్రభుత్వం కూడా తమ దేశంలోని ఉద్యోగులకు 6 రోజుల పాటు పెయిడ్ లీవ్స్ మంజూరు చేయటంతో అదే తరహాలో యూఏఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. యూఏఈ అధ్యక్షుడి మంత్రిత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ఇప్పటికే 8 రోజుల పెయిడ్ లీవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దుబాయ్ ఎక్స్ పో ఈ నెల 1 ప్రారంభమైంది. వచ్చే ఏడాది 31 వరకు ఇది కొనసాగనుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







