భారత విదేశాంగ సహాయ మంత్రి తో ఇండియన్ గల్ఫ్ లీడర్ల సమావేశం

- October 07, 2021 , by Maagulf
భారత విదేశాంగ సహాయ మంత్రి తో ఇండియన్ గల్ఫ్ లీడర్ల సమావేశం

కువైట్: గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఇండియన్స్ లీడర్లతో భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.గల్ఫ్ లో ఉన్న ఇండియన్స్ సమస్యలు, వారికి అక్కడ ఉన్న అవకాశాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇండియన్స్ కు ఎలాంటి సాయమైన ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ఇండియన్ కమ్యూనిటీ ఇన్ కువైట్, ప్రవాసీ భారతీయ అవార్డ్ గ్రహీత రాజ్ గోపాల్ త్యాగి పాల్గొన్నారు. డాక్టర్స్ అసోసియేషన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, చార్టెడ్ అకౌంటెంట్స్, ఐఐటీ/ఐఐఎం పూర్వ విద్యార్థులతో పాటు పలు ఇండియన్ అసోసియేషన్ లీడర్లు పాల్గొన్నారు. కువైట్ లో ఇండియన్ అంబాసిడర్ సిబి జార్జ్  కూడా మీటింగ్ లో పాల్గొని ఇండియన్స్ కు ఏ అవసరమొచ్చిన వెంటనే ఎంబసీని సంప్రదించాలని కోరారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com