జీఎస్టీ పరిహారం కింద మరో ₹40వేల కోట్లు.. ఏపీ, తెలంగాణకు ఎంతెంత?
- October 07, 2021
న్యూ ఢిల్లీ: జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మరో రూ.40వేల కోట్లు విడుదల చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు విడుదల చేసిన మొత్తం 1.15 లక్షల కోట్లకు చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరిహారం కింద ఆంధ్రప్రదేశ్కు రూ.823.17 కోట్లు, తెలంగాణకు రూ.1149.46 కోట్లు కేంద్రం విడుదల చేసింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఏర్పడే రూ.1.59 లక్షల కోట్ల లోటును రిజర్వుబ్యాంకు నుంచి తీసుకొనే రుణం ద్వారా చెల్లించడానికి మే 28న జరిగిన 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం అంగీకరించింది. 2020-21లో ఇదే విధానంలో కేంద్రం రాష్ట్రాలకు రూ.1.10 లక్షల కోట్లు అందించింది. 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు చెల్లిస్తోంది. సెస్ వసూళ్ల ఆధారంగా చెల్లించే రూ.లక్ష కోట్ల పరిహారం కూడా కలిపితే ఈ ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం రూ.2.59 లక్షల కోట్లు అందుతుందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. జులై 15న విడుదల చేసిన రూ.75వేల కోట్లతో కలిపి ఇప్పటి వరకు జీఎస్టీ పరిహారం కింద 1.15 కోట్లను బ్యాక్-టు-బ్యాక్ లోన్ రూపంలో రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









