జీఎస్టీ పరిహారం కింద మరో ₹40వేల కోట్లు.. ఏపీ, తెలంగాణకు ఎంతెంత?
- October 07, 2021
న్యూ ఢిల్లీ: జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మరో రూ.40వేల కోట్లు విడుదల చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు విడుదల చేసిన మొత్తం 1.15 లక్షల కోట్లకు చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరిహారం కింద ఆంధ్రప్రదేశ్కు రూ.823.17 కోట్లు, తెలంగాణకు రూ.1149.46 కోట్లు కేంద్రం విడుదల చేసింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఏర్పడే రూ.1.59 లక్షల కోట్ల లోటును రిజర్వుబ్యాంకు నుంచి తీసుకొనే రుణం ద్వారా చెల్లించడానికి మే 28న జరిగిన 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం అంగీకరించింది. 2020-21లో ఇదే విధానంలో కేంద్రం రాష్ట్రాలకు రూ.1.10 లక్షల కోట్లు అందించింది. 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు చెల్లిస్తోంది. సెస్ వసూళ్ల ఆధారంగా చెల్లించే రూ.లక్ష కోట్ల పరిహారం కూడా కలిపితే ఈ ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం రూ.2.59 లక్షల కోట్లు అందుతుందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. జులై 15న విడుదల చేసిన రూ.75వేల కోట్లతో కలిపి ఇప్పటి వరకు జీఎస్టీ పరిహారం కింద 1.15 కోట్లను బ్యాక్-టు-బ్యాక్ లోన్ రూపంలో రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







