తుపాను బాధిత కుటుంబాలకు 1,000 రియాల్స్ సాయం
- October 09, 2021
ఒమన్:ఒమన్ లో షాహీన్ తుపాను బాధితులకు ప్రభుత్వం కాస్త ఉపశమనం కల్పించింది. సైక్లోన్ ఎఫెక్ట్ తో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి తక్షణం వెయ్యి రియాల్ సాయం ప్రకటించింది. రెస్క్యూ టీమ్ లు యుద్ధప్రాతిపదిక సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. షాహీన్ ఎఫెక్ట్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం మంత్రి వర్గ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తుపాను బాధిత కుటుంబాలకు మరింత సాయం చేస్తామని ప్రభుత్వం తెలిపింది. విరిగిన స్తంభాలను, చెట్లను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు.
ఇప్పటికీ ఎఫెక్ట్ ఒమన్ లోని కొన్ని పట్ణణాలు, సిటీల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. అపార్ట్ మెంట్ వాసులకు, ప్రజలకు హెలికాప్టర్ ద్వారా ఫుడ్, వాటర్ సప్లయ్ చేస్తున్నారు. ఖబౌరా సహా కొన్ని ప్రాంతాల్లో వాతావారణ పరిస్థితులు ఇప్పటికీ కంట్రోల్ లోకి రాలేదు. నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ (NCEM) ప్రజలకు భరోసా ఇస్తూ సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









