తుపాను బాధిత కుటుంబాలకు 1,000 రియాల్స్ సాయం
- October 09, 2021
ఒమన్:ఒమన్ లో షాహీన్ తుపాను బాధితులకు ప్రభుత్వం కాస్త ఉపశమనం కల్పించింది. సైక్లోన్ ఎఫెక్ట్ తో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి తక్షణం వెయ్యి రియాల్ సాయం ప్రకటించింది. రెస్క్యూ టీమ్ లు యుద్ధప్రాతిపదిక సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. షాహీన్ ఎఫెక్ట్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం మంత్రి వర్గ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తుపాను బాధిత కుటుంబాలకు మరింత సాయం చేస్తామని ప్రభుత్వం తెలిపింది. విరిగిన స్తంభాలను, చెట్లను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు.
ఇప్పటికీ ఎఫెక్ట్ ఒమన్ లోని కొన్ని పట్ణణాలు, సిటీల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. అపార్ట్ మెంట్ వాసులకు, ప్రజలకు హెలికాప్టర్ ద్వారా ఫుడ్, వాటర్ సప్లయ్ చేస్తున్నారు. ఖబౌరా సహా కొన్ని ప్రాంతాల్లో వాతావారణ పరిస్థితులు ఇప్పటికీ కంట్రోల్ లోకి రాలేదు. నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ (NCEM) ప్రజలకు భరోసా ఇస్తూ సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







