ధియేటర్ లకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

- October 13, 2021 , by Maagulf
ధియేటర్ లకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

అమరావతి: ఏపీలోని ధియేటర్ లకి సర్కార్ శుభవార్తని చెప్పింది. రాష్ట్రంలోని అన్నీ ధియేటర్ లలో వందశాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. దీనితో దసరా పండగ సందర్భంగా విడుదల కానున్న మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలకి కలిసి రానుంది. కాగా రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిస్తున్నట్టు తెలిపింది. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున అయిదు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. దీనితో ధియేటర్ లలో నైట్ షోలకి అడ్డంకులు తొలిగిపోయాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com