రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టిన మరో బడా వ్యాపారి...

- October 17, 2021 , by Maagulf
రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టిన మరో బడా వ్యాపారి...

హైదరాబాద్: బ్లిస్ వీకెండ్ హోమ్ ప్రాపర్టీ సంస్థ వారు తమ కొత్త ప్రాజెక్ట్ ను లాంఛ్ చేశారు. సిద్ధపూర్ లో  వీకెండ్ హోమ్ పేరుతో చేపట్టిన ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,సంస్థ డైరెక్టర్ జాషువా పాల్, సినీ రచయిత సిరాశ్రీ, సినీ నిర్మాత మధుర శ్రీధర్,కళామందిర్ కళ్యాణ్,లగడపాటి శ్రీధర్, హీరో చైతన్య కృష్ణ,హీరో శివాజీ,సినీ డైరెక్టర్ బి.వి.ఎస్ రవి, సింగర్ స్మిత, సినీ నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.రవి కుమార్ పనస ఇంతక ముందు టాలీవుడ్ లోని పెద్ద సినిమా హీరోలకు పి.ఆర్.ఓ గా పనిచేసారు మరియు తెలంగాణ ప్రభుత్వ ఈవెంట్లు నిర్వహించారు.ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో అనేక ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు.

బ్లిస్ వీకెండ్ హోమ్స్ సంస్థ సీఈఓ రవికుమార్ పనస మాట్లాడుతూ... మీ అభిరుచికి అనుగుణంగా అత్యంత విలాసవంతమైన ఇళ్లు అందుబాటులో ధరల్లోనే ఉన్నాయని తెలిపారు.ఐటీ హబ్, ఎడ్యుకేషన్ సంస్థలు, హెల్త్ కేర్ సెంటర్లతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న సిద్ధపూర్ లో  ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. అటు ప్రకృతికి, ఇటు సిటి కి సమీపంలో ఈ ఇళ్లు ఉంటుందన్నారు. త్వరగా ఇళ్లు బుక్ చేసుకోవాలని కోరారు.రానున్న రోజుల్లో రేట్లు మరింత పెరుగతాయని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com