ఒక్క కేసు కూడా లేని ఆ దేశంలో ఇప్పుడు డెల్టా ముప్పు
- October 18, 2021వెల్లింగ్టన్: న్యూజిలాండ్లోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్లో మళ్లీ రెండు వారాల పాటు లాక్డౌన్ను పొడిగించారు. అక్కడ డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. మొదట్లో ఒక్క కేసు కూడా నమోదు కాని దేశంగా నిలిచిన న్యూజిలాండ్ ఇప్పుడు డెల్టా వేరియంట్తో సతమతం అవుతోంది. ఆక్లాండ్తో పాటు పొరుగు ప్రాంతాల్లో కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. సరిహద్దు మూసివేత , లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా ఉన్నా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. సామాజిక కలయికలపై ఆంక్షలను ఎత్తివేయడం లేదని ప్రధాని అన్నారు. నిబంధనలను సడలిస్తే వైరస్ను నియంత్రించడం వీలుకాదు అని, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగం చేయాలని ప్రధాని జెసిండా అభిప్రాయపడ్డారు.
17 లక్షల జనాభా ఉన్న ఆక్లాండ్లో ఆగస్టు నెలలో లాక్డౌన్ నిబంధనలు మొదలయ్యాయి. అక్కడ స్కూళ్లు, వ్యాపారసముదాయాలు, ఆఫీసులను ఇంకా మూసివేశారు. ఇండోర్స్ సమావేశాలకు కూడా అనుమతి ఇవ్వడంలేదు. న్యూజిలాండ్లో కొత్తగా నమోదు అయిన ఇన్ఫెక్షన్లతో కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. సోమవారం కొత్తగా 60 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంట్లో ఆక్లాండ్లోనే 57 కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి