ఇండియా టూరిస్టు వీసాలకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలి

- October 19, 2021 , by Maagulf
ఇండియా టూరిస్టు వీసాలకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలి

మస్కట్: ఒమనీయులు ఇండియా వచ్చేందుకు పర్యాటక వీసాల కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని మస్కట్ లోని  ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో అక్టోబర్ 15 కంటే ముందు తీసుకున్న వీసాలను సస్పెండ్ చేసినట్లు రాయబార కార్యాలయం ప్రకటించింది. తాజాగా ఇండియాలో కోవిడ్ నిబంధనలు సడలించడంతో తాజాగా వీసాలు జారీ చేస్తున్నామని, అక్టోబర్ 15 నుంచి వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. వీసాలు పొందిన వారు నవంబర్ 15 నుంచి ఇండియాలో పర్యాటకానికి అనుమతిస్తారు. టూరిస్టు వీసాపై ఒక్కరిని 30 రోజులకు మాత్రమే అనుమతిస్తారు. ఇండియాలో ప్రవేశించిన వారు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. టూరిస్ట్ వీసా బుక్ చేయాలనుకునే వారు ఒమన్‌లో Wattayah లోని BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్ నుండి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా http://www.indianvisaonline.gov.in/evisa ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com