ఇండియా టూరిస్టు వీసాలకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలి
- October 19, 2021
మస్కట్: ఒమనీయులు ఇండియా వచ్చేందుకు పర్యాటక వీసాల కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో అక్టోబర్ 15 కంటే ముందు తీసుకున్న వీసాలను సస్పెండ్ చేసినట్లు రాయబార కార్యాలయం ప్రకటించింది. తాజాగా ఇండియాలో కోవిడ్ నిబంధనలు సడలించడంతో తాజాగా వీసాలు జారీ చేస్తున్నామని, అక్టోబర్ 15 నుంచి వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. వీసాలు పొందిన వారు నవంబర్ 15 నుంచి ఇండియాలో పర్యాటకానికి అనుమతిస్తారు. టూరిస్టు వీసాపై ఒక్కరిని 30 రోజులకు మాత్రమే అనుమతిస్తారు. ఇండియాలో ప్రవేశించిన వారు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. టూరిస్ట్ వీసా బుక్ చేయాలనుకునే వారు ఒమన్లో Wattayah లోని BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్ నుండి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా http://www.indianvisaonline.gov.in/evisa ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







