పర్వతం పైనుంచి వాహనం పడి నలుగురు మృతి, ఐదుగురికి గాయాలు
- October 19, 2021
సౌదీ: రియాద్ నగరానికి పశ్చిమాన ఉన్నఎత్తైన పర్వతం పైనుంచి శనివారం వాహనం కిందపడిన ఘటనలో నలుగురు ప్రయాణికులు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ముహమ్మద్ అల్-హమ్మది ప్రకారం.. ఆ వాహనంలో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారని, గాయపడ్డ వారిని సెక్యూరిటీ ఏవియేషన్ విమానంలో సమీప ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
యూనిఫైడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తరువాత సివిల్ డిఫెన్స్ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ఆయన తెలిపారు. ప్రమాద స్థలం నుంచి నలుగురి మృతదేహాలను వెలికి తీశామన్నారు. పర్వతాలపై పర్యటనకు పోయే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అల్-హమ్మది ప్రజలకు సూచించారు. అత్యవసర సమయాల్లో మక్కా, రియాద్ ప్రాంతాలలో 911... కింగ్డమ్లోని ఇతర ప్రాంతాలలో 998 నంబర్ కు ఫోన్ చేసిన సహాయం పొందాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం







