తాజా ట్రావెల్ గైడ్ లైన్స్ జారీ చేసిన భారత్
- October 21, 2021న్యూఢిల్లీ: భారత దేశానికి వచ్చే ప్రయాణికుల కోసం ప్రయాణ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ప్రయాణికులు తప్పనిసరిగా నెగెటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టును సమర్పించాలని పేర్కొంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ రేటు తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కవరేజ్ పెరగడంతో సవరించిన ఈ మార్గదర్శకాలు ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తాయి.
కేటగిరీ ‘ఏ’లోకి వచ్చే దేశాల నుంచి భారత దేశానికి వచ్చేవారు అదనపు నిబంధనలను పాటించవలసి ఉంటుంది. భారత దేశానికి వచ్చిన తర్వాత పరీక్షలు చేయించుకోవడం వంటి నిబంధనలను పాటించాలి. దీనిని ఈ నెల 20న అప్డేట్ చేశారు. ఈ కేటగిరీలోకి వచ్చే దేశాలు : యునైటెడ్ కింగ్డమ్ సహా యూరోపులోని దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే.
కేటగిరీ ‘బీ’లోకి వచ్చే దేశాలతో భారత ప్రభుత్వం ఓ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు పొందిన కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను పూర్తిగా తీసుకున్న వ్యక్తులకు జారీ చేసిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను పరస్పరం గుర్తించడం కోసం ఈ ఒప్పందం కుదిరింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన లేదా డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందిన కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను పూర్తిగా తీసుకున్న భారత పౌరులను మినహాయిస్తున్న దేశాలు కూడా ఈ జాబితాలోకి వస్తాయి. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెలారస్, లెబనాన్, అర్మేనియా, ఉక్రెయిన్, బెల్జియం, హంగరీ, సెర్బియా ఈ జాబితాలో ఉన్నాయి. దీనిని ఈ నెల 20న అప్డేట్ చేశారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు మండే ఎండలు
- చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..
- ఇండోనేషియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు అగ్నిపర్వతం విస్పోటనం
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
- ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- BD97,000 దుర్వినియోగం..బహ్రెయిన్లో అరబ్కు జైలుశిక్ష
- దుబాయ్ వ్యక్తి రెస్క్యూ మిషన్: గర్భిణీ నర్సు, వృద్ధ జంట, పర్యాటకులు సేఫ్