ఒమన్, బహ్రెయిన్ వాణిజ్య మంత్రుల సమావేశం
- October 21, 2021
మనామా: బహ్రెయిన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ జాయెద్ రషీద్ అల్ జయానీతో ఒమన్ వాణిజ్య, పరిశ్రమ ల మంత్రి కైస్ మహ్మద్ అల్ యూసఫ్ సమావేశమయ్యారు. మనామాలో జరుగుతున్న జీసీసీ వాణిజ్య, పరిశ్రమల మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఈ రెండు దేశాల మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒమన్, బహ్రెయిన్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బహ్రెయిన్ లో ని ఒమన్ రాయబారి మహ్మద్ అలీ అల్ బలుషి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. వ్యాపార సంబంధాలు, ప్రోత్సహకాలపై సంబంధించిన అంశాలను ప్రధానంగా చర్చించారు. రెండు దేశాల పెట్టుబడులకు సంబంధించి ఆసక్తి గా ఉన్న వ్యాపారులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







