ఒమన్, బహ్రెయిన్ వాణిజ్య మంత్రుల సమావేశం
- October 21, 2021మనామా: బహ్రెయిన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ జాయెద్ రషీద్ అల్ జయానీతో ఒమన్ వాణిజ్య, పరిశ్రమ ల మంత్రి కైస్ మహ్మద్ అల్ యూసఫ్ సమావేశమయ్యారు. మనామాలో జరుగుతున్న జీసీసీ వాణిజ్య, పరిశ్రమల మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఈ రెండు దేశాల మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒమన్, బహ్రెయిన్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బహ్రెయిన్ లో ని ఒమన్ రాయబారి మహ్మద్ అలీ అల్ బలుషి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. వ్యాపార సంబంధాలు, ప్రోత్సహకాలపై సంబంధించిన అంశాలను ప్రధానంగా చర్చించారు. రెండు దేశాల పెట్టుబడులకు సంబంధించి ఆసక్తి గా ఉన్న వ్యాపారులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు