టీ20 వరల్డ్ కప్: పాకిస్తాన్ టార్గెట్ 152
- October 24, 2021
దుబాయ్: టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను పాక్ బౌలర్లు మొదట్లో భయపెట్టారు. తొలి ఓవర్లోనే రోహిత్ను వెనక్కి పంపి భారత శిబిరంలో కల్లోలం రేపారు.
ఆ తర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. 31 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన వేళ క్రీజులోకి వచ్చిన పంత్తో కలిసి కోహ్లీ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఇద్దరూ క్రీజులో కుదురుకున్నాక స్కోరు పెంచడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బ్యాట్ ఝళిపించిన పంత్ రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది స్కోరు బోర్డును కాసేపు పరుగులు పెట్టించాడు.
ఈ క్రమంలో షాదాబ్ ఖాన్ బౌలింగులో భారీ షాట్కు యత్నించి అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మొత్తం 30 బంతులు ఎదుర్కొన్న పంత్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. పంత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన జడేజా 13 పరుగులే చేసి అవుటయ్యాడు. మరోవైపు అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ భారీ షాట్కు యత్నించి అవుటయ్యాడు.
49 బంతులు ఎదుర్కొన్న విరాట్ 5 ఫోర్లు, సిక్సర్తో 57 పరుగులు చేశాడు.మరోవైపు, భారీ షాట్లతో అలరిస్తాడనుకున్న పాండ్యా 11 పరుగులే చేసి అవుటయ్యాడు. పాక్ బౌలర్లలో షహీన్ ఖాన్ 3 వికెట్లు తీయగా, హసన్ అలీ 2, షాదాబ్ ఖాన్, రవూఫ్ చెరో వికెట్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







