ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా..!
- October 26, 2021
అమెరికా: భారత్పై విధించిన ప్రయాణ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. భారత్తో పాటు పలు దేశాలపై కూడా ఆంక్షలను ఎత్తివేసిన అమెరికా ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నిబంధనలు నవంబర్ 8వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. కరోనా విజృంభణతో గత సంవత్సరం అమెరికా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రయోజనాల దృష్ట్యా ఆంక్షల్ని సడలిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. వ్యాక్సిన్ ఆధారిత అంతర్జాతీయ ప్రయాణాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిని నవంబర్ 8 నుంచి అమెరికాలోకి అనుమతించనున్నారు. ప్రయాణికులు విమానం ఎక్కేముందే తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా, డబ్ల్యుహెచ్వో గుర్తించిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికి అమెరికాలోకి అనుమతి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కూడా కరోనా నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రెండేళ్ల పిల్లలకు కొవిడ్ టెస్టు అవసరం లేదని నిబంధనల్లో స్పష్టం చేశారు. అలాగే వ్యాక్సినేషన్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉన్న సుమారు 50 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సైతం ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించింది. వీరు అమెరికాకు వచ్చిన రెండు నెలల్లోగా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ: లైసెన్స్ లేని సంస్థల నుండి గృహ కార్మికులను నియమించుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు
- సీఎం కేసీఆర్తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ