వింటర్ ఫ్లూ వ్యాక్సినేషన్ కు రిజిస్ట్రేషన్స్ షురూ
- October 30, 2021
కువైట్: చలికాలం లో వచ్చే సీజనల్ వ్యాధులు, ఫ్లూ జ్వరాల నివారణకు ఇచ్చే వ్యాక్సినేషన్ కు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్టార్ట్ చేసింది. 30 ఏళ్లకు పైబడిన వారంతా ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హెల్త్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ సూచించారు. హెల్త్ మినిస్ట్రీ వెబ్ సైట్ లో లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. అదే విధంగా ఈ నెల 30 న మిష్రెఫ్ ఏరియాలోని కువైట్ సెంటర్ లో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఏ కారణం చేతనైనా రెండో డోస్ తీసుకోనివారికి ఇక్కడ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు. కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న గ్రూప్ లకు సంబంధించి మూడో డోస్ కూడా ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వింటర్ డిసీస్ క్యాంపెయిన్, వ్యాక్సినేషన్ తో కార్యక్రమంలో భాగంగానే కరోనా మూడో డోస్ ను కూడా ఇస్తామని డాక్టర్ అబ్దుల్లా తెలిపారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







