వింటర్ ఫ్లూ వ్యాక్సినేషన్ కు రిజిస్ట్రేషన్స్ షురూ
- October 30, 2021
కువైట్: చలికాలం లో వచ్చే సీజనల్ వ్యాధులు, ఫ్లూ జ్వరాల నివారణకు ఇచ్చే వ్యాక్సినేషన్ కు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్టార్ట్ చేసింది. 30 ఏళ్లకు పైబడిన వారంతా ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హెల్త్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ సూచించారు. హెల్త్ మినిస్ట్రీ వెబ్ సైట్ లో లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. అదే విధంగా ఈ నెల 30 న మిష్రెఫ్ ఏరియాలోని కువైట్ సెంటర్ లో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఏ కారణం చేతనైనా రెండో డోస్ తీసుకోనివారికి ఇక్కడ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు. కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న గ్రూప్ లకు సంబంధించి మూడో డోస్ కూడా ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వింటర్ డిసీస్ క్యాంపెయిన్, వ్యాక్సినేషన్ తో కార్యక్రమంలో భాగంగానే కరోనా మూడో డోస్ ను కూడా ఇస్తామని డాక్టర్ అబ్దుల్లా తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









