అంతర్జాతీయ విమాన సర్వీసులపై మళ్లీ నిషేధం పొడిగింపు..
- October 30, 2021
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నవంబర్ 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ కొనసాగుతుందని శుక్రవారం డీజీసీఏ(DGCA) వెల్లడించింది.అయితే, వందే భారత్ మిషన్, ఎయిర్ బబుల్ ఒప్పందం కింద నడుస్తున్న ప్రత్యేక ఇంటర్నెషనల్ విమాన సర్వీసులు యధావిధిగా పని చేస్తాయని డీజీసీఏ ప్రకటించింది. కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గత ఏడాది మార్చి 23 నుంచి భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2020 మే మొదటి వారం నుంచి వందే భారత్ మిషన్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంపిక చేసిన దేశాల నుంచి విమాన సర్వీసులు నడిపిస్తోంది.
అలాగే ఇదే ఏడాది జూలై నుంచి భారత్ కొన్ని దేశాలతో 'ఎయిర్ బబుల్' ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా, బ్రిటన్, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా సుమారు 28 దేశాలతో భారత ప్రభుత్వం ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. దీంతో ఆయా దేశాల నుంచి ఇండియాకు ప్రత్యేక నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా పొడిగించిన నిషేధం కారణంగా అంతర్జాతీయ కార్గో విమానాలతో పాటు ఇతర కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించిన వాటిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని DGCA స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









