భారత్, కువైట్ మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు
- November 01, 2021
కువైట్: ఇండియా, కువైట్ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 31న కువైట్ టవర్స్ పై ఇండియా, కువైట్ జాతీయ జెండాలను ప్రదర్శించారు. కువైట్లోని భారత రాయబారి సిబి జార్జ్ ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత ఆరు దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య అద్భుతమైన సంబంధాలను గుర్తు చేశారు. పరస్పర విశ్వాసం, అవగాహన, సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఇండియా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు.. ఐకానిక్ కువైట్ టవర్స్ పై భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడంపై జార్జ్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలలో స్థిరమైన పురోగతికి మద్దతు, సహకారానికి కువైట్ నాయకత్వానికి, కువైట్ ప్రజలకు రాయబారి సిబి జార్జ్ ధన్యవాదాలు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!
- శ్వాస విధానం నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? ఆసక్తికర అధ్యయనం..!!
- మస్కట్ విమానాశ్రయంలో ఒమానీ ప్రయాణికులే టాప్..!!
- కువైట్లో 48 శాతం తగ్గిన జువైనల్ క్రైమ్స్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా ఫలితాలు.. ఇద్దరికి దక్కిన Dh100,000..!!
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ







