భారత్, కువైట్ మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు
- November 01, 2021
కువైట్: ఇండియా, కువైట్ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 31న కువైట్ టవర్స్ పై ఇండియా, కువైట్ జాతీయ జెండాలను ప్రదర్శించారు. కువైట్లోని భారత రాయబారి సిబి జార్జ్ ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత ఆరు దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య అద్భుతమైన సంబంధాలను గుర్తు చేశారు. పరస్పర విశ్వాసం, అవగాహన, సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఇండియా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు.. ఐకానిక్ కువైట్ టవర్స్ పై భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడంపై జార్జ్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలలో స్థిరమైన పురోగతికి మద్దతు, సహకారానికి కువైట్ నాయకత్వానికి, కువైట్ ప్రజలకు రాయబారి సిబి జార్జ్ ధన్యవాదాలు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!







