యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- July 06, 2026
అబుదాబి: కస్టమర్ ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE).. యూఏఈలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ విదేశీ బ్యాంకు శాఖపై Dh1.82 మిలియన్ల జరిమానా విధించింది. అయితే జరిమానా విధించిన బ్యాంకు పేరును సెంట్రల్ బ్యాంక్ వెల్లడించలేదు.
సెంట్రల్ బ్యాంక్ నిర్వహించిన తనిఖీల్లో, సంబంధిత బ్యాంకు శాఖ కస్టమర్కు ఇవ్వాల్సిన లయబిలిటీ లెటర్ను నిర్దేశించిన ఏడు రోజుల గడువులో జారీ చేయలేదని గుర్తించారు. దీంతో బ్యాంక్ మార్కెట్ కండక్ట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ అండ్ స్టాండర్డ్స్ను ఉల్లంఘించినట్లు తేలిందని ప్రకటించారు.
సాధారణంగా కస్టమర్ తన రుణాలను మరో ఆర్థిక సంస్థకు బదిలీ చేసుకోవాలన్నా, లేదా కొత్త ఆర్థిక సంస్థ నుంచి రుణం పొందాలన్నా లయబిలిటీ లెటర్ అవసరం అవుతుంది. వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు బ్యాంకులు నిర్దిష్ట గడువులోపు ఈ లెటర్ ను జారీ చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన బ్యాంకు శాఖపై జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. యూఏఈ చట్టాలు, సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన నిబంధనలు, ప్రమాణాలను బ్యాంకులు, వాటి యాజమాన్యాలు, ఉద్యోగులు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ రంగంలో నిబంధనల అమలును మరింత కట్టుదిట్టం చేయడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







