ట్రాఫిక్ వాయిలేషన్స్ నివారణకు సీసీకెమెరాల ఏర్పాటు
- November 01, 2021
ఖతార్: ఖతార్ లో ట్రాఫిక్ ఉల్లంఘనుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం, స్మార్ట్ ఫోన్లను డ్రైవింగ్ లోనే వినియోగించటం సాధారణమైపోయింది. దీంతో ట్రాఫిక్ కు చాలా ఇబ్బంది అవుతోంది. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. సమస్య ఎక్కువ కావటంతో ఇంటిరీయర్ మినిస్ట్రీ డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ ఈ అంశంపై దృష్టి పెట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని పక్కా ఆధారాలతో పట్టుకునేందుకు సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆరు నెలల క్రితమే రోడ్లకు ఇరు వైపుల, ప్రధాన కూడళ్లలో సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తామని ట్రాఫిక్ డైరెక్టర్ చెప్పారు. ప్రస్తుతం ఈ కెమెరాలను పలు చోట్ల ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవింగ్ చేస్తూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ఓ మహిళను కూడా సీసీకెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళన కలిగిస్తోంది
డ్రైవింగ్ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య పెరిగిపోతుందని ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ కల్నల్ మహమ్మద్ రాడి అల్ హజ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది డ్రైవింగ్ లోనూ, ఇళ్లలో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘనలో ఎక్కువ సీటు బెల్ట్ ధరించకపోవటం, డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడటం కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. సీసీకెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై స్పష్టమైన పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







