నవంబర్ 27 నుంచి మదీనాకు ఎతిహాద్ విమాన సర్వీసులు
- November 01, 2021
అబుధాబి: కరోనా ఎఫెక్ట్ కారణంగా సౌదీ లోని మదీనా కు విమాన సర్వీసులు నిలిపివేసిన ఎతిహాద్ ఎయిర్ వేస్ మళ్లీ సేవలను స్టార్ట్ చేయనుంది. నవంబర్ 27 నుంచి అబుదాబి నుంచి మదీనా కు విమానాలను నడిపిస్తామని సంస్థ ప్రకటించింది. ఎయిర్ బస్ 321 ద్వారా వారానికి మూడు సార్లు అబుదాబి నుంచి మదీనా కు ఫ్లైట్ సర్వీసులు ఉంటాయని తెలిపింది. సౌదీలోని పవిత్ర మక్కా, మదీనా లకు ఎప్పటి మాదిరిగానే పర్యాటకులను అనుమతిస్తామని సౌదీ ప్రభుత్వం గత నెలలోనే ప్రకటించింది. ఈ నేఫథ్యంలోనే మదీనాకు ఎతిహాద్ విమాన సర్వీసులను పునరుద్దరిస్తోంది. ఐతే ప్రయాణికులు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని నిబంధన పెట్టింది. సౌదీ ప్రభుత్వం కూడా మదీనా కు వచ్చే వారు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్న వారై ఉండాలని తెలిపింది. వ్యాక్సినేషన్ పూర్తైన వారికి ఎలాంటి క్వారంటైన్ నిబంధనలను సౌదీ విధించలేదు. దీంతో రెండు డోసుల వ్యాక్సిినేషన్ పూర్తైన వారు మదీనా కు వెళ్లవచ్చు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







