వ్యక్తిగత పనుల కోసం వినియోగిస్తే, యజమానికి 100,000 సౌదీ రియాల్స్ జరిమానా,జైలు శిక్ష
- November 01, 2021
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజాత్), ఎంప్లాయర్ (యజమాని) ఎవరైనా తమ వ్యక్తిగత అవసరాల కోసం కార్మికుల్ని వినియోగిస్తే, ఇతర యజమానుల కోసం వినియోగిస్తే.. అలాంటి యజమానికి 100,000 సౌదీ రియాల్స్ జరీమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం వుందని పేర్కొంది. సదరు యజమానికి రిక్రూట్మెంట్ బ్యాన్ కూడా ఐదేళ్ళపాటు విధించే అవకాశం వుంది. ఎంప్లాయర్ వలసదారుడైతే, దేశం నుంచి బహిష్కరిస్తారు కూడా. ఉల్లంఘనల్లో ఎంతమంది కార్మికుల్ని వినియోగిస్తే, అందుకు అనుగుణంగా జరీమానా పెరుగుతుంటుంది. ఉల్లంఘనలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చుననీ మక్కా అలాగే రియాద్ రీజియన్లకు చెందినవారు 911 నెంబరులోనూ, ఇతర రీజియన్లకు చెందినవారు 999 నెంబరులోనూ ఫిర్యాదు చేయాలనీ సూచించారు అధికారులు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







