ICC T20: దుమ్ములేపిన టీమిండియా..
- November 03, 2021
అబుధాబి: అబుధాబి క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ విశ్వరూపం ప్రదర్శించింది. పాకిస్థాన్, న్యూజిలాండ్పై ఓడి బోల్డన్ని విమర్శలు మూటగట్టుకున్న కోహ్లీసేన ఈ మ్యాచ్లో చెలరేగిపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సెమీస్ అవకాశాలు లేని వేళ ఆఫ్ఘన్ జట్టుపై బ్యాట్తో నిప్పులు చెరిగింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
టాస్ గెలిచి భారత్కు బ్యాటింగ్ అప్పగించడం ఎంత ప్రమాదకరమో రాహుల్, రోహిత్ బ్యాటింగ్ను చూశాక కానీ ఆఫ్ఘన్ కెప్టెన్ నబీకి తెలిసిరాలేదు. ఇద్దరూ ఎడాపెడా షాట్లు కొడుతూ తొలి వికెట్కు ఏకంగా 140 పరుగులు జోడించారు. రాహుల్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్తో 74 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ 13 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 27, హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేయడంతో భారత స్కోరు జెట్ స్పీడుతో పరిగెత్తి 210 పరుగుల వద్ద ఆగింది.
తాజా వార్తలు
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!







