ICC T20: దుమ్ములేపిన టీమిండియా..
- November 03, 2021
అబుధాబి: అబుధాబి క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ విశ్వరూపం ప్రదర్శించింది. పాకిస్థాన్, న్యూజిలాండ్పై ఓడి బోల్డన్ని విమర్శలు మూటగట్టుకున్న కోహ్లీసేన ఈ మ్యాచ్లో చెలరేగిపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సెమీస్ అవకాశాలు లేని వేళ ఆఫ్ఘన్ జట్టుపై బ్యాట్తో నిప్పులు చెరిగింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
టాస్ గెలిచి భారత్కు బ్యాటింగ్ అప్పగించడం ఎంత ప్రమాదకరమో రాహుల్, రోహిత్ బ్యాటింగ్ను చూశాక కానీ ఆఫ్ఘన్ కెప్టెన్ నబీకి తెలిసిరాలేదు. ఇద్దరూ ఎడాపెడా షాట్లు కొడుతూ తొలి వికెట్కు ఏకంగా 140 పరుగులు జోడించారు. రాహుల్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్తో 74 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ 13 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 27, హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేయడంతో భారత స్కోరు జెట్ స్పీడుతో పరిగెత్తి 210 పరుగుల వద్ద ఆగింది.
తాజా వార్తలు
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!









