APNRTS కువైట్ టీం వారి సహకారంతో స్వస్థలానికి చేరిన ఏపీ మహిళ
- November 05, 2021
కువైట్:ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ఉబ్బా దుర్గా,అనే మహిళ కువైట్ దేశంలో కువైటీ ఇంట్లో పని చేస్తూ అనివార్య కారణాల వల్ల బయటకు వచ్చేసి, బయట పని చేసుకుంటూ ఉన్న సమయంలో కాలుకు, దెబ్బ తగిలి నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమె, కువైట్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించి, తనను భారత్ కు తిరిగి పంపాలని కోరింది.
ఈ విషయం తెలుసుకున్న APNRTS డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్, వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆదేశాల మేరకు,APNRTS రీజనల్ కో-ఆర్డినేటర్ నాయని మహేశ్వర రెడ్డి, కువైట్ లోని భారత రాయబార కార్యాలయ అధికారుల సహాయ సహకారాలతో పేపర్ వర్క్ అంత పూర్తి చేసి ఉబ్బా దుర్గ ను ఇండియాకు తిరిగి పంపడం జరిగింది.
ఈ సందర్భముగా ఉబ్బా దుర్గ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి, ఏపిఎన్ఆర్టీఎస్ చైర్మన్ మేడపాటి వెంకట్, సీఈఓ దినేష్ కుమార్,APNRTS డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్, వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, నాయని మహేశ్వర్ రెడ్డి, మరియు ఆర్థికంగా ఆదుకొని, 3నెలల పాటు వసతి ఏర్పాటు చేసిన వైఎస్సార్సిపీ నాయకులు N.V సుబ్బారెడ్డి, భారత రాయబార కార్యాలయం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
APNRTS చైర్మన్ మేడపాటి వెంకట్, డైరెక్టర్ ఇలియాస్ మాట్లాడుతూ...కువైట్ లోని APNRTS సభ్యులు చేస్తున్నసేవలకు హర్షం వ్యక్తం చేస్తూ, ముమ్మడి బాలిరెడ్డి, నాయని మహేశ్వర్ రెడ్డి, N.V సుబ్బారెడ్డి కి అభినందిస్తూ,భారత రాయబార కార్యాలయ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
_1636100978.jpg)
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









