అపార్టుమెంట్లో చెలరేగిన మంటలు.. ముగ్గురు చిన్నారులను రక్షించిన సివిల్ డిఫెన్స్ సిబ్బంది
- November 06, 2021
సౌదీ: జెడ్డాలోని ఓ అపార్టుమెంట్లో మంటలు అంటుకోవడంతో అంతటా చీకటి అలుముకుంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు అందులో చిక్కుకుని భయంతో వణికిపోయారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహారించి ఎంతో కష్టపడి ఆ చిన్నారులను రక్షించారు. ఏ మాత్రం ఆలస్యం జరిగినా, పొరబాటు చోటుచేసుకున్నా ఆ చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవే. ఈ ఘటన జెడ్డాలో జరిగింది. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. కొద్ది సేపట్లోనే అవి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. మంటలు అంటుకున్న భవనంలో ముగ్గురు చిన్నారులు చిక్కుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఎంతో కష్టపడి ముగ్గురు పిల్లలను రక్షించి బయటకు తీసుకొచ్చారు. పిల్లలకు అవసరమైన వైద్యం అందించడానికి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







