అపార్టుమెంట్లో చెలరేగిన మంటలు.. ముగ్గురు చిన్నారులను రక్షించిన సివిల్ డిఫెన్స్ సిబ్బంది
- November 06, 2021
సౌదీ: జెడ్డాలోని ఓ అపార్టుమెంట్లో మంటలు అంటుకోవడంతో అంతటా చీకటి అలుముకుంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు అందులో చిక్కుకుని భయంతో వణికిపోయారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహారించి ఎంతో కష్టపడి ఆ చిన్నారులను రక్షించారు. ఏ మాత్రం ఆలస్యం జరిగినా, పొరబాటు చోటుచేసుకున్నా ఆ చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవే. ఈ ఘటన జెడ్డాలో జరిగింది. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. కొద్ది సేపట్లోనే అవి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. మంటలు అంటుకున్న భవనంలో ముగ్గురు చిన్నారులు చిక్కుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఎంతో కష్టపడి ముగ్గురు పిల్లలను రక్షించి బయటకు తీసుకొచ్చారు. పిల్లలకు అవసరమైన వైద్యం అందించడానికి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







