అపార్టుమెంట్లో చెలరేగిన మంటలు.. ముగ్గురు చిన్నారులను రక్షించిన సివిల్ డిఫెన్స్ సిబ్బంది
- November 06, 2021
సౌదీ: జెడ్డాలోని ఓ అపార్టుమెంట్లో మంటలు అంటుకోవడంతో అంతటా చీకటి అలుముకుంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు అందులో చిక్కుకుని భయంతో వణికిపోయారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహారించి ఎంతో కష్టపడి ఆ చిన్నారులను రక్షించారు. ఏ మాత్రం ఆలస్యం జరిగినా, పొరబాటు చోటుచేసుకున్నా ఆ చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవే. ఈ ఘటన జెడ్డాలో జరిగింది. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. కొద్ది సేపట్లోనే అవి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. మంటలు అంటుకున్న భవనంలో ముగ్గురు చిన్నారులు చిక్కుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఎంతో కష్టపడి ముగ్గురు పిల్లలను రక్షించి బయటకు తీసుకొచ్చారు. పిల్లలకు అవసరమైన వైద్యం అందించడానికి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









