బహుమతులు గెలిచారంటూ సైబర్ మోసాలు..
- November 06, 2021
ఒమన్: కొత్త పద్ధతి సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. OTP వెరిఫికేషన్ కోడ్ను నేరస్థులు ఉపయోగించుకుని సైబర్ మోసాలకు పాల్పడే కొత్త రకం సైబర్ మోసాన్ని గుర్తించామన్నారు. "సైబర్ నేరగాళ్లు బాధితులకు ఫోన్ చేసి.. ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రం నుండి బహుమతిని గెలుచుకున్నారని, మీ ఫోన్ కు వచ్చే OTP చెబితే బహుమతి మీదవుతుందని నమ్మబలుకుతారు. ఆ తర్వాత OTP చెప్పగానే ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేస్తారు.’’ అని రాయల్ ఒమన్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్మెంట్ తెలిపింది. అందుకే అలాంటి ఫోన్ కాల్స్ లకు స్పందించవద్దని, OTP ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని రాయల్ ఒమన్ పోలీసులు సూచించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..