బహుమతులు గెలిచారంటూ సైబర్ మోసాలు..
- November 06, 2021
ఒమన్: కొత్త పద్ధతి సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. OTP వెరిఫికేషన్ కోడ్ను నేరస్థులు ఉపయోగించుకుని సైబర్ మోసాలకు పాల్పడే కొత్త రకం సైబర్ మోసాన్ని గుర్తించామన్నారు. "సైబర్ నేరగాళ్లు బాధితులకు ఫోన్ చేసి.. ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రం నుండి బహుమతిని గెలుచుకున్నారని, మీ ఫోన్ కు వచ్చే OTP చెబితే బహుమతి మీదవుతుందని నమ్మబలుకుతారు. ఆ తర్వాత OTP చెప్పగానే ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేస్తారు.’’ అని రాయల్ ఒమన్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్మెంట్ తెలిపింది. అందుకే అలాంటి ఫోన్ కాల్స్ లకు స్పందించవద్దని, OTP ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని రాయల్ ఒమన్ పోలీసులు సూచించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







