బహుమతులు గెలిచారంటూ సైబర్ మోసాలు..

- November 06, 2021 , by Maagulf
బహుమతులు గెలిచారంటూ సైబర్ మోసాలు..

ఒమన్: కొత్త పద్ధతి సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. OTP వెరిఫికేషన్ కోడ్‌ను నేరస్థులు ఉపయోగించుకుని సైబర్ మోసాలకు పాల్పడే కొత్త రకం సైబర్ మోసాన్ని గుర్తించామన్నారు. ‎"సైబర్ నేరగాళ్లు బాధితులకు ఫోన్ చేసి.. ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రం నుండి బహుమతిని గెలుచుకున్నారని, మీ ఫోన్ కు వచ్చే OTP చెబితే బహుమతి మీదవుతుందని నమ్మబలుకుతారు. ఆ తర్వాత OTP చెప్పగానే ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేస్తారు.’’ అని రాయల్ ఒమన్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. అందుకే అలాంటి ఫోన్ కాల్స్ లకు స్పందించవద్దని, OTP ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని రాయల్ ఒమన్ పోలీసులు సూచించారు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com