ఇండియా నుంచి 45,000 మంది ప్రయాణీకులు

- November 06, 2021 , by Maagulf
ఇండియా నుంచి 45,000 మంది ప్రయాణీకులు

కువైట్: ఆగస్ట్ 1 నుంచి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాక 45,000 మంది ప్రయాణీకులు ఇండియా నుంచి కువైట్ వచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇండియాకి 85,000 మంది ప్రయాణించారు. మొత్తం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ట్రాఫిక్ 130,000గా నమోదయ్యింది. ఏడు ఎయిర్ లైన్స్ విమానాల్ని ఇండియా నుంచి కువైట్‌ మధ్య నడుస్తున్నాయి ఈ సమయంలో. కాగా, టర్కీ బిజీయెస్ట్ డెస్టినేషన్ అయ్యిందనీ, టర్కీ నుంచి అలాగే టర్కీకి వెళ్ళి వచ్చిన ప్రయాణీకుల సంఖ్య 314,000గా వుందని తెలుస్తోంది. సౌదీ అరేబియా రెండో స్థానంలో నిలిచింది. 1,550 విమానాల ద్వారా మొత్తం 144,000 మంది ప్రయాణీకులు ప్రయాణించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాలుగో స్థానంలో వుంది 138,000 మంది ప్రయాణీకులతో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com