భారత రాయబార కార్యాలయంలో కరోనా కలకలం...ఒకరికి కోవిడ్ పాజిటివ్

- November 07, 2021 , by Maagulf
భారత రాయబార కార్యాలయంలో కరోనా కలకలం...ఒకరికి కోవిడ్ పాజిటివ్

కువైట్: భారత రాయబార కార్యాలయంలో కోవిడ్ 19 కేసు నమోదు కావడం కలకలం రేపింది. నవంబర్ 6, 2021న ఎంబసీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈవెంట్‌కు హాజరైన వారితోపాటు వారితో పరిచయం ఉన్న వారందరూ కోవిడ్-19కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో మళ్లీ నోటీసు ఇచ్చే వరకు ఎంబసీకి సంబంధించిన అన్ని పబ్లిక్ ఈవెంట్‌లను రద్దు చేసినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. అయితే పబ్లిక్ సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com