సౌదీలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతం...22 మిలియన్ల జనాభాకు రెండు డోసులు

- November 08, 2021 , by Maagulf
సౌదీలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతం...22 మిలియన్ల జనాభాకు రెండు డోసులు

రియాద్: సౌదీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వేగవంతం చేసింది. వీలైనంత త్వరగా దేశంలోని అందరికీ రెండు డోసులు వ్యాక్సినేషన్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 21.7 మిలియన్ల జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ కంప్లీట్ అవటం విశేషం. 46.2 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లు సౌదీ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. త్వరలోనే అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇక ఆదివారం కొత్తగా 40 కరోనా కేసులు నమోదయ్యాయి. రియాద్ లో 13, జెడ్డా లో 7, మదీనా లో 4, మక్కా లో 3 ఇతర నగరాల్లో 13 కేసులు నమోదయ్యాయి.  మహమ్మరి కారణంగా ఒకరు చనిపోయారు. ప్రస్తుతం 8, 804 మంది కరోనాతో భాదపడుతున్నారు. ఇక రికవరీ విషయానికొస్తే 5,37, 858 మంది కరోనా నుంచి కోలుకోవటం విశేషం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com