సౌదీలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతం...22 మిలియన్ల జనాభాకు రెండు డోసులు
- November 08, 2021
రియాద్: సౌదీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వేగవంతం చేసింది. వీలైనంత త్వరగా దేశంలోని అందరికీ రెండు డోసులు వ్యాక్సినేషన్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 21.7 మిలియన్ల జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ కంప్లీట్ అవటం విశేషం. 46.2 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లు సౌదీ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. త్వరలోనే అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇక ఆదివారం కొత్తగా 40 కరోనా కేసులు నమోదయ్యాయి. రియాద్ లో 13, జెడ్డా లో 7, మదీనా లో 4, మక్కా లో 3 ఇతర నగరాల్లో 13 కేసులు నమోదయ్యాయి. మహమ్మరి కారణంగా ఒకరు చనిపోయారు. ప్రస్తుతం 8, 804 మంది కరోనాతో భాదపడుతున్నారు. ఇక రికవరీ విషయానికొస్తే 5,37, 858 మంది కరోనా నుంచి కోలుకోవటం విశేషం.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









