సౌదీలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతం...22 మిలియన్ల జనాభాకు రెండు డోసులు
- November 08, 2021
రియాద్: సౌదీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వేగవంతం చేసింది. వీలైనంత త్వరగా దేశంలోని అందరికీ రెండు డోసులు వ్యాక్సినేషన్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 21.7 మిలియన్ల జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ కంప్లీట్ అవటం విశేషం. 46.2 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లు సౌదీ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. త్వరలోనే అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇక ఆదివారం కొత్తగా 40 కరోనా కేసులు నమోదయ్యాయి. రియాద్ లో 13, జెడ్డా లో 7, మదీనా లో 4, మక్కా లో 3 ఇతర నగరాల్లో 13 కేసులు నమోదయ్యాయి. మహమ్మరి కారణంగా ఒకరు చనిపోయారు. ప్రస్తుతం 8, 804 మంది కరోనాతో భాదపడుతున్నారు. ఇక రికవరీ విషయానికొస్తే 5,37, 858 మంది కరోనా నుంచి కోలుకోవటం విశేషం.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







