దుబాయ్ ఎయిర్ షో: 16 ఏళ్ల తర్వాత పాల్గొంటున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్
- November 13, 2021
యూఏఈ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సారంగ్, తేజస్, సూర్యకిరణ్ రోబాటిక్స్ బృందాలు దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొంటున్నాయి. దుబాయ్ ఎయిర్ షోలో తొలిసారిగా సూర్యకిరణ్, తేజస్ తమ వైమానిక విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. ఈ బృందాలు నిన్న యుఎఇకి చేరుకున్నాయని, ఎయిర్ షో కోసం సిద్ధమవుతున్నాయని భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. "ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)ని UAE ప్రభుత్వం దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొనడానికి ఆహ్వానించింది. సౌదీ హాక్స్, రష్యన్ నైట్స్, UAE యొక్క అల్ వంటి ప్రపంచంలోని అత్యుత్తమ ఏరోబాటిక్స్, డిస్ప్లే టీమ్లతో కలిసి ప్రదర్శన ఇవ్వడానికి ఆహ్వానించబడింది. " బ్యూరో తెలిపింది. ఎయిర్ షోలో ఇండియాకు చెందిన సారంగ్, సూర్యకిరణ్, తేజస్ ఏరోబాటిక్స్ బృందాలు తమ విన్యాసాలతో అలరించనున్నాయి. సారంగ్ అంటే హిందీలో మల్టీ కలర్స్ అని అర్ధం. సూర్యకిరణ్ అంటే సూర్యకాంతి కిరణాలు, తేజస్ అంటే హిందీలో గంభీరమైన లేదా శక్తివంతమైనది. 2005లో అల్ ఐన్ గ్రాండ్ ప్రిక్స్లో చివరగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొంది. మళ్లీ 16 సంవత్సరాల తర్వాత ఇండియాకు చెందిన ప్రముఖ ఏరోబాటిక్స్ బృందాలు వచ్చే వారం జరుగనున్న దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొనేందుకు యూఏఈకి వచ్చాయి.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







