స్టార్ హీరో సూర్యను కొడితే లక్ష ఫ్రైజ్..!

- November 15, 2021 , by Maagulf
స్టార్ హీరో సూర్యను కొడితే లక్ష ఫ్రైజ్..!

తమిళ స్టార్ హీరో సూర్యను కొడితే రూ. లక్ష బహుమానం ఇస్తామని పీఎమ్ కే పార్టీ తెలిపింది. అయితే హీరో సూర్య ఇటీవల జై భీమ్ అనే సినిమా లో నటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా లో ఒక వర్గానికి చెందిన మత పరమైన చిహ్నం ఉండటం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమా లో ప్రధాన పాత్ర లో నటించిన సూర్య ను , ఆ చిత్ర బృందాన్ని కొట్టిన వారికి రూ. లక్ష బహుమానం గా ఇస్తామని పీఎమ్‌కే పార్టీ నేతలు చెప్పారు.

అయితే పీఎమ్‌కే పార్టీ చేసిన ప్రకటన పై సూర్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ వర్గానికి చెందిన వారు రాజకీయం గా బలం గా ఉన్న సామాజికంగా చాలా బలహీనంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుటుంది. అంతే కాకుండా ఈ సినిమా కు చాలా అవార్డు లు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చాలా మంది అంటున్నారు. అయితే ఇలాంటి సినిమా పై పీఎమ్‌కే పార్టీ చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా చాలా మంది సినీ అభిమానులు సూర్య కు మద్దత్తు గా #WeStandWithSuriya అనే హాష్ టాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com