సోమాలియాలో భారీ పేలుడు
- November 25, 2021
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఐరాస భద్రతా సిబ్బంది కాన్వారులో భారీ పేలుడు జరిగింది.ఈ పేలుడు ఘటనలో ఎనిమిది మంది మరణించగా, 17 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 13 మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా సిబ్బంది లక్ష్యంగా గురువారం తెల్లవారుజామున ఎస్యువి వాహనం నిండా పేలుడు పదార్థాలతో సూసైడ్ బాంబర్ దాడి జరిపినట్లు పోలీసుల ప్రతినిధి అబ్దిఫత్ అడెన్ హసన్ తెలిపారు. మొగదిషులోని కె4 జంక్షన్ సమీపంలో పేలుడు జరిగిందని, అనంతరం కాల్పులు కూడా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కె4 జంక్షన్ సమీపంలోనే ముకస్సర్ ప్రాథమిక, సెకండరీ పాఠశాల, ఆస్పత్రి ఉన్నాయని అన్నారు. పేలుడు దాటికి పాఠశాల, ఆస్పత్రి కూలిపోయాయని, వివరాలు తెలియదని అన్నారు. అలాగే ఈ దాడిలో ఐక్యరాజ్యసమితి సిబ్బందిలో ఎంత మంది మరణించారు, ఎంత మంది గాయపడ్డారు… అనే అంశంపై స్పష్టత లేదని, స్పందించేందుకు యుఎన్ అధికారులు నిరాకరించారని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ పేలుడు ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు అల్-షబాబ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







